Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్‌ చెప్పేసి తెగతెంపులా? మే 11 నుంచి సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభం

ఫోనులో, వాట్సప్, ఫేస్ బుక్‌ల ద్వారా తలాక్ చెప్పేయడం ద్వారా భార్యను వదిలించుకునే భర్తలపై ముస్లిం మహిళలు తిరగబడుతున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యం

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (15:39 IST)
ఫోనులో, వాట్సప్, ఫేస్ బుక్‌ల ద్వారా తలాక్ చెప్పేయడం ద్వారా భార్యను వదిలించుకునే భర్తలపై ముస్లిం మహిళలు తిరగబడుతున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి వాదనలను విననుంది. ట్రిపుల్ తలాక్‌పై వాదనలు మే 11 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఐదుగురు జడ్జిలతో కూడిన బెంచ్ దీనిపై వాదనలు వినిన తర్వాత నిర్ణయించనుంది. సంప్రదాయపరంగా జరిగిన వివాహ బంధాన్ని.. ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా తెగతెంపులు చేయడం సరికాదని ముస్లిం మహిళలు వాదిస్తున్నారు. 
 
దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలతో భర్తలు తెగతెంపులు చేసుకోవడం అనైతికమన్నారు. ఈ పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.  పురుషులు మూడుసార్లు తలాఖ్ చెప్పేసి భార్యలను వదిలించుకోవడాన్ని అనుమతించడం సరికాదని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments