Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌-పీజీ 2021: పాత సిలబస్‌నే పునరుద్ధరించాలి.. సుప్రీం కోర్టు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:08 IST)
నీట్‌-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్‌నే పునరుద్ధరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో కేంద్రం, జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై అక్షింతలు వేసింది. పాత సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని ఆదేశించింది.
 
ఈ అంశంపై బుధవారం కూడా విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. దీంతో పాత సిలబస్‌తోనే నీట్ పీజీ నిర్వహణతోపాటు పరీక్షా తేదీలను మార్చే విషయమై తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కోర్టు ఒకరోజు గడువు ఇచ్చింది.
 
వైద్య విద్యాభ్యాసం, వైద్యవృత్తి నిర్వహణకు రూపొందించిన నిబంధనలు దాన్ని వ్యాపారంగా మార్చేలా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తమకు అధికారం ఉందని యువ డాక్టర్లను ఫుట్‌బాల్ ఆడుకోవద్దని ఇంతకుముందు విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
 
దీనిపై సోమవారం కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం.. సవరించిన సిలబస్‌తోనే నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అయితే, విద్యార్థులు ప్రిపేర్ కావడానికి పరీక్షను రెండు నెలలు వాయిదా వేస్తామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments