Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ మసీదు కేసు ఏప్రిల్‌కు వాయిదా... బీజేపీ నేతలకు విముక్తి లభించేనా?

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వకంగా నివేదికలు అందించాలని కోర్

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (17:22 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వకంగా నివేదికలు అందించాలని కోర్టు ఆదేశించింది. రెండు వారాల తర్వాత కేసు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. 
 
1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఎల్కే. అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, వినయ్ కతియార్ సహా 13 మంది భాజపా నేతలపై కుట్ర అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. దీంతో సీబీఐ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
 
అయితే, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేవలం సాంకేతిక కారణాలతో 13 మంది భాజపా నేతలపై ఉన్న కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది. 
 
వాస్తవానికి ఈ కేసులో బుధవారమే కోర్టు తీర్పును వెలువరించాల్సి వుండగా, గురువారానికి వాయిదా వేసింది. అయితే, గురువారం మరోమారు విచారణకు రాగా రెండు వారాల పాటు వాయిదా వేయడం గమనార్హం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments