Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (13:59 IST)
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకునివున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ కోసం బయటకు వచ్చారు. ఏడు నెలల తర్వాత ఆమె ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె... నాసాకు చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి ఐఎస్ఎస్‌కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సివుంది. 2012లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా, ఓవరాల్‌గా ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. 
 
సునీత, విల్మెర్లు 8 రోజుల మిషన్‌లో భాగంగా గత యేడాది జూన్ 6వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్‌సూల్లో ‘ఐఎస్ఎస్'కు వెళ్లారు. అదే నెల 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై.. వారు అక్కడే చిక్కుకుపోయారు. 
 
ఈ ఏడాది మార్చి ఆఖరులో లేదా ఏప్రిల్ నెలలో వారు భూమికి తిరుగుప్రయాణమయ్యే అవకాశం ఉందని సమాచారం. సునీతా విలియమ్స్ ప్రస్తుతం మూడో రోదసి యాత్రలో ఉన్నారు. గతంలో 2006, 2012లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్ వాక్‌లు నిర్వహించి.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉండి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments