Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను ఆశ్రయించిన సుధామూర్తి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (10:19 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. తన పేరును దుర్వినియోగపరుస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేసారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కొందరు డబ్బు వసూళ్ళకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. 
 
తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్సీ) వారు గతంలో సుధామూర్తిని ఆహ్వానించారు. తీరిక లేకుండా ఉన్న కారణంగా తాను రాలేనని ఆమె చెప్పారు. కానీ, ఆ కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్టు జరుగుతున్న ప్రచారం గురించి సుధామూర్తి దృష్టికి వచ్చింది. 
 
అయితే, లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి తమను మోసం చేసినట్టు కేకేఎన్సీ వారు పేర్కొన్నారు. మరో ఉదంతంలోనూ సుధామూర్తి పేరును ఓ మహిళ దుర్వినియోగపరిచింది. అమెరికాలో జరిగే ఓ కార్యక్రమానికి ఆమె హాజరవుతారంటూ ప్రచారం చేసింది. 
 
కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వారి నుంచి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది. ఇక సుధామూర్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె పేరు చెప్పి మోసాలకు దిగిన మహిళలు ఇండియాలో ఉన్నారా? లేక అమెరికాలో ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments