Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజన్‌ దైవదూత.. నేను దెయ్యాన్నా? మీడియా ఆకాశానికెత్తేస్తోంది : స్వామి ఫైర్

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు లక్ష్యంగా ఎంచుకున్నారు. రాజన్ దైవదూత అయితే.. తాను దెయ్యాన్నా అంటూ మండిపడ్డారు.

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (08:31 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌పై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు లక్ష్యంగా ఎంచుకున్నారు. రాజన్ దైవదూత అయితే.. తాను దెయ్యాన్నా అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో మీడియాను కూడా దుయ్యబట్టారు. రాజన్‌ను మీడియా ఆకాశానికెత్తేస్తోందంటూ మండిపడ్డారు. 
 
ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రాజన్‌ను దైవదూతలా, నన్ను దెయ్యంలా మీడియా చిత్రీకరిస్తోంది. మీడియా ప్రచారం తీరు చూస్తే, మనల్ని రక్షించడం కోసం ఆయన విదేశాల నుంచి దిగివచ్చినట్టుగా ఉంది. ఆయన్ను మీడియా బాగా ఎత్తేస్తోంది. రాజన్‌ వైదొలిగితే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిపోతుందని మీడియానే భయపెట్టింది. కానీ వాస్తవంలో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచి.. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులకు అప్పులు పుట్టకుండా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్‌ నష్టం చేస్తున్నారంటూ  సుబ్రమణ్య స్వామి విమర్శలు ఎక్కుపెట్టారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments