పనిలేనివారిని ఆహ్వానించి రాజ్‌భవన్‌ను కాఫీ షాపుగా మార్చేశారు.. : మంత్రి పొన్నుడి

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (13:52 IST)
పనిలేని వారిని ఆహ్వానించి రాజ్‌భవన్‌ను కాఫీషాపుగా మార్చివేశారంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవిపై తమిళనాడు ఉన్నత విద్యాశాఖామంత్రి పొన్ముడి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో ఓ ఆర్మీ జవాను అధికార డీఎంకే కౌన్సిలర్, ఆయన అనుచరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీన్ని సాకుగా పెట్టుకుని గవర్నర్‌ను కలిసిన తమిళనాడు బీజేపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ట్విట్టర్ వేదికగా జవాన్ హత్యపై స్పందించారు. ఆర్మీ జవాను ప్రభు హత్య "తీవ్ర ఆందోళన కలిగించే అంశం" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
దీనికి రాష్ట్ర మంత్రి డాక్టర్ పొన్ముడి ఘాటుగానే రిప్లై ఇచ్చారు. "పనిలేనివారిని ఆహ్వానించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ద్వారా రాజ్‌భవన్‌ను కాఫీ షాపుగా మార్చడం గవర్నర్ పని కాకూడదు" అని అన్నారు. "ఓ రాజకీయ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు చేసిన అభ్యర్థనను ప్రచురిస్తున్న రాజ్‍భవన్ ఆన్‌లైన్.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ తయారు చేసిన ముసాయిదా బిల్లు రాజ్‌భవన్‌లో ఏ స్థితిలో ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తుందా? ఇతర పెండింగ్‌ బిల్లుల గురించి వారికి చెబుతుందా? అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments