Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికేవున్నాడు.. కోమాలో వున్నాడని ఏడాది పాటు ఇంట్లోనే మృతదేహం

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (10:33 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఏడాది పాటు ఓ ఫ్యామిలీ మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకుంది. కనీసం మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. దీంతో డెడ్ బాడీ కుళ్లిపోయింది. ఎంతగా అంటే.. ఎముకల్లోని మజ్జ కూడా ఇంకిపోయేంతగా.. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటన యూపీ శివపురిలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన అహ్మదాబాద్​లో ఐటీలో విధులు నిర్వహిస్తూ 2021 ఏప్రిల్​ 22న మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
విమలేశ్ కనిపించకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. అయితే విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరినీ నమ్మించారు. 
 
కానీ పెన్షన్‌కు అప్లై చేసుకునేందుకు విమలేశ్​మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. 
 
వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విమలేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments