ఐ యామ్ సారీ.. బీ హ్యాపీ.. మరో పెళ్లి చేసుకో... ప్రియుడికి ప్రియురాలి వీడియో సందేశం

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (10:14 IST)
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఓ ప్రియురాలు తన ప్రియుడుకి ఓ వీడియో సందేశం పంపించింది. తనను క్షమించాలని ప్రాధేయపడింది. పైగా, సంతోషంగా ఉంటూ.. మరో పెళ్లి చేసుకోవాలని సూచిస్తూ ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ పేరు రాధా ఠాకోర్(27). సొంతంగా ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంది. ఈ విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో వెలుగుచూసింది. 
 
అసలు రాధా ఠాకోర్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? అవతలి వ్యక్తికి ఆమె ఎందుకు క్షమాపణ చెప్పింది? తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె ఓ ఫొటోను పంపించాలని అడిగినా అతడు పంపలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. 7 గంటల లోపు ఫొటో రాకపోతే ఏం జరుగుతుందో చూడు' ఆమె అన్నట్లుగా రికార్డింగ్లో పోలీసులు గుర్తించారు. 
 
మరో వీడియోలో.. "నన్ను క్షమించు. నిన్ను అడగకుండా ఒక తప్పటడుగు వేస్తున్నా. బాధపడొద్దు. జీవితాన్ని ఆస్వాదించు. ఆనందంగా ఉండు. పెళ్లి చేసుకో. రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. నువ్వు సంతోషంగా ఉంటేనే నా ఆత్మకు శాంతి. పని, జీవితం పట్ల కలతతో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నా" అని పేర్కొంది.
 
మరోవైపు, ఈ ఘటనపై ఆమె సోదరి ఆల్కా మాట్లాడుతూ.. "రాధ బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగొచ్చాక.. భోజనం చేసి నిద్రపోయింది. ఉదయం లేచేసరికి మృతిచెంది ఉంది. ఫోన్ చెక్ చేయగా.. రికార్డు చేసిన కొన్ని వీడియోలు ఉన్నాయి. మేం ప్రతిదీ పోలీసులకు అందజేశాం. ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిపైనే మాకు అనుమానం ఉంది" అన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments