Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య నిర్మాణానికి రూ.15 కోట్ల విరాళం.. ముస్లిం ఎమ్మెల్సీ ఆఫర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య నిర్మాణానికి ఓ ముస్లిం ఎమ్మెల్సీ భారీ మొత్తంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రామాలయం నిర్మాణానికి రూ.15 కోట్లు దానంగా ఇస్తానని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన బుక్కల్ నవ

Webdunia
సోమవారం, 15 మే 2017 (15:50 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య నిర్మాణానికి ఓ ముస్లిం ఎమ్మెల్సీ భారీ మొత్తంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రామాలయం నిర్మాణానికి రూ.15 కోట్లు దానంగా ఇస్తానని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన బుక్కల్ నవాబ్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి డబ్బు రావాల్సివుందని, అందులో నుంచే తాను దేవాలయం నిర్మాణం నిమిత్తం విరాళం ఇస్తానని చెప్పారు. 
 
శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించారని నమ్ముతున్నందున అక్కడ గుడి ఉండి తీరాలని అన్నారు. కాగా, బుక్కల్‌కు ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల వరకూ నష్ట పరిహారం వస్తుందని అంచనా.  
 
కాగా, కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ముస్లిం ఎమ్మెల్యే కూడా గొంతుకలపడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments