Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారుకు కొమ్ముకాయడం తప్ప జయలలిత చేసిందేమీ లేదు: సోనియా

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:02 IST)
కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుకు కొమ్ముకాయడం మినహా తమిళనాడు సీఎం జయలలిత ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు గల ఇబ్బందుల్ని జయ ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోనియా దుయ్యబట్టారు. చెన్నైని వరదలు ముంచెత్తితే కేంద్రం నాలుగు వారాల్లో బీమా చెల్లిస్తుందని చెప్పారని కానీ నాలుగు నెలలైనా ఏమీ చేయలేదన్నారు.
 
డీఎంకే కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కరుణానిధి, సోనియాగాంధీలు ఒకే వైదికపైకి వచ్చి ప్రసంగించారు. సోనియాగాంధీ తన ప్రసంగంలో అన్నాడీఎంకే వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. తమిళనాడు రాష్ట్రం డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. డీఎంకే హయాంలో రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు నెలకొన్నాయని, పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 
 
రాష్ట్రంలో మునుపటి అభివృద్ధి సాధించాలంటే అది డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. ప్రజలు కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని అన్నాడీఎంకేలకు ఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. డీఎంకే నేత కరుణానిధి మాట్లాడుతూ డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments