Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంతకాలం మా కుటుంబాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు : ఎస్పీజీ చీఫ్‌కు సోనియా లేఖ

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (09:04 IST)
ఇంతకాలం మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు ధన్యవాదాలు అంటూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) చీఫ్‌ అరుణ్ సిన్హాకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ప్రముఖ నాయకులకు కల్పించే వ్యక్తిగత భద్రతపై ఐదేళ్లకోసారి జరిపే సమీక్షలో కేంద్రం ఎస్పీజీ భద్రతను ఇటీవల తొలగించింది. ఈ నేపథ్యంలో సోనియా, ఎస్పీజీ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాశారు. అంకిత భావంతో 28 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి కల్పించిన భద్రత పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
 
'ఎస్పీజీని కేటాయించినప్పటి నుంచి మా కుటుంబం సురక్షితంగా ఉంది. అది మావెంట ఉండటంతో మా బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించగలిగాం. ఎస్పీజీ అద్భుతమైన దళం. బలగాలకు దేశభక్తితోపాటు, పనిని ఖచ్చితంగా నిర్వహించే సామర్థ్యముంది. మా కుటుంబానికి అంకితభావంతో రక్షణ కల్పించినందుకు ప్రశంసిస్తున్నా' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్పీజీ రక్షణ విభాగాన్ని తొలగించి, ఇకపై వంద మందితో కూడిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments