Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

Webdunia
గురువారం, 21 జులై 2022 (09:56 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె విచారణను ఎదుర్కోనున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విచారించారు.
 
ఆ సమయంలో సోనియా గాంధీ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరివున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటికి రావడంతో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో ఆమె గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకానున్నారు. 
 
మరోవైపు, సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఆందోళనల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టనున్నారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ వర్గాల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ భారీగా పోలీసులు మొహరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును ఇప్పటికే మూసివేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీ సంఖ్యలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments