Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సార్.. మణిపూర్ గురించి మాట్లాడండి.. సోనియా గాంధీ

Webdunia
గురువారం, 20 జులై 2023 (14:20 IST)
మణిపూర్‌ పరిస్థితిపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు లోక్‌సభలో ప్రధానితో సంక్షిప్త సంభాషణ సందర్భంగా సోనియా గాంధీ ఈ డిమాండ్ చేశారు.
 
ఈ రోజు సభ సమావేశానికి ముందు, ప్రధాని మోదీ వివిధ నేతలను పలకరించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని, చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
దోషులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. ఇకపోతే సేనాపతి జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురిచేస్తున్న వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుల్లో ఒకరిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments