Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఏ ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టారు: సోనియా గాంధీ

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (16:05 IST)
అభివృద్ధి పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టి అమలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏవేవో చేసేస్తున్నామని అవాస్తవ ప్రచారం చేసుకుంటుందని సోనియా గాంధీ మండిపడ్డారు.
 
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 70వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా బిల్లును పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పారు. 
 
ప్రజలకు తప్పుడు వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందని ఆమె అన్నారు. కొంతమంది తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందారని దుయ్యబట్టారు. బూటకపు కలలను అమ్మకుంటోందని కేంద్రంపై సోనియా ధ్వజమెత్తారు. 
 
2004లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ.. కొన్ని రాజకీయ పార్టీల అడ్డుకోవడం వల్లే ఆగిపోయిందని సోనియా గాంధీ చెప్పారు. తాము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments