Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంపులు గుంపులుగా తిరగొద్దు.. మాస్కులు తప్పనిసరి చేయండి..

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (10:36 IST)
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా రెండో దశలోకి ప్రవేశించింది. 
 
దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స సామర్థ్యం పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. అదేవిధంగా ప్రజలు గుంపులుగా తిరగకుండా చూడాలని, మాస్కులు వేసుకోవడంతో పాటు ఇతర అన్ని కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. 
 
 అలాగే దేశంలో కొత్తగా 35,871 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,74,605కి చేరింది. ఇందులో 1,10,63,025 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,52,364 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 172 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,216కి చేరింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments