Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్నాథ్‌లో మంచు తఫాను : బాధితుల్లో మాజీ సీఎం, ఓ ఎంపీ

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫానులో చిక్కుకుని పోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్‌

Webdunia
బుధవారం, 9 మే 2018 (11:34 IST)
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫానులో చిక్కుకుని పోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్‌లు కూడా ఉన్నారు.
 
దీనిపై రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గౌరికుంద్‌కు వెళ్లే దాదాపు 4,200 మంది యాత్రికులు మంచు తుఫాను కారణంగా కేదార్నాథ్‌లో చిక్కుకుపోయారని, వీరిలో 400 మందికి పైగా వృద్ధులు ఉన్నారని తెలిపారు. 
 
అయితే, వీరందరినీ సురక్షితంగా రక్షించేందుకు స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ జవాన్లు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదు ఇంచుల మేర మంచు కురుస్తుండటంతో హెలికాప్టర్ సేవలు, యాత్రికుల కదలికలు నిలిచిపోయాయని తెలిపారు. 

అలాగే, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న మంచు తుఫానులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మితో పాటు పలువురు జెడ్పీటీసీలు చిక్కుకున్నారు. ఉపాధి హామి పనుల అమలు తీరును పరిశీలించేందుకు వీరంతా గత వారంలో ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. చార్‌ధామ్ సమీపంలోని సీతాపురి ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మంచు తుఫానులో వీరంతా చిక్కుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments