Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 5 జులై 2024 (19:10 IST)
సాధారణంగా ఓ పాము కాటేస్తే.. విషపూరితమైనది అయితే.. మనిషి నిమిషాల్లో మరణిస్తాడు. కానీ మనిషి కాటేస్తే పాము చనిపోయిన వింత ఘటన చోటుచేసుకుంది. పాము తనను కాటేసిందన్న కోపంతో తిరిగి దాన్ని కరవడంతో ఆ పాము చనిపోయింది. ఈ ఘటన బీహార్ లోని నవాడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రైల్వే కార్మికుడు సంతోష్ లోహార్.. మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అంతలో అతడ్ని పాము కాటేసింది. దీంతో ఏదో కుట్టిందని లేచి చూడగా.. పాము కనిపించింది. తనను పాము కాటేసిందన్న కోపంతో.. వెంటనే పామును పట్టుకుని, రెండు సార్లు కొరికాడు. దీంతో పాము మరణించింది. 
 
అతడు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించారు. పాము తనను కరిచినా, తిరిగి అతడు పామును కొరికినా.. విషం అతడ్ని ఏం చేయలేకపోయింది. అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments