మంత్రి స్మృతి ఇరానీకి రాహుల్ ఫ్లైయింగ్ కిస్... మహిళా ఎంపీల ఫిర్యాదు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (15:12 IST)
లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ అవిశ్వాసంపై చర్చ పూర్తికాగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు ఆయన ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. దీనిపై స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన ఇంతకుముందు చూడలేదన్నారు. 
 
దీనిపై ఆమె రాహుల్ తీరును ఖండించారు. 'స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది' అంటూ మండిపడ్డారు. 
 
ఇంకోవైపు, ఈ వ్యవహారంపై భాజపా మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాహుల్ అనుచిత ప్రవర్తనపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments