Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్ళలో పొగతాగితే ఇక జైలేగతి : రైల్వే శాఖ చర్యలు

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:18 IST)
రైళ్లలో పొగతాగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. రైలు బోగీల్లో పొగతాగితే జైలు శిక్ష విధించాలని చూస్తోంది. ఆ దిశగా ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
గత వారం ఢిల్లీ - డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలకు తాగి పడేసిన సిగరెట్ లేదా బీడీయే కారణమై ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పొగతాగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
 
ఈ నెల 13న ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సీ-4 బోగీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు. 
 
అయితే షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని తొలుత భావించారు. కానీ, బాత్‌రూంలో ఉన్న చెత్తకుండిలో ఎవరో తాగిపడేసిన సిగరెట్‌ లేదా బీడీ పీక వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలింది.
 
దీంతో రైళ్ళలో పొగతాగేవారిని గుర్తించి అవసరమైతే జైలుకు కూడా పంపేందుకు వెనుకాడొద్దని భావిస్తోంది. రైళ్లలో  సిగరెట్లు, బీడీలు తాగడం అంటే ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేయడమేనని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments