Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను లేపుకెళ్లాడనీ... కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు

Webdunia
గురువారం, 16 మే 2019 (12:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు చేసిన వెధవపనికి అతని కుటుంబ సభ్యులందరినీ అనేక మంది కలిసి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గ్రామ శివార్లలో నివశిస్తున్నాడు. 
 
ఈ మహిళకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆమెను వదిలి ఉండలేని ఆ యువకుడు ఆమెను లేపుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ముఖేష్.. భార్యకు, ఆ యువకుడుతో ఫోనులో మాట్లాడి... సమస్యను చర్చించి పరిష్కరించుకుందామని చెప్పి గ్రామానికి రప్పించారు. 
 
ఆపై ఆ యువకుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను పట్టుకుని తన స్నేహితుల సాయంతో చెట్టుకు కట్టేసి చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఘటనా స్థలికి చేరుకుని, గాయాలతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోస్కో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments