Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కోసం తమ్ముడిని హత్య చేయబోయింది, కటకటాల పాలైంది

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (18:42 IST)
నేరస్తుడైన భర్తను జైలు నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నించి ఆమె కూడా చివరికి అక్కడికే చేరింది. భర్తను విడిపించడానికి ఖర్చులు కోసం డబ్బు కొరవవడంతో తమ్ముడి సహాయం కోరింది. ఆస్తి అమ్మి తనకు డబ్బు సమకూర్చాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. కానీ తమ్ముడు నిరాకరించడంతో మనసులో పగను పెంచుకుంది. బెంగుళూరులో యలహంక ప్రాంతంలోని బీబీరోడ్డులో నివాసముంటున్న సందీప్ రెడ్డి, సుమలత అక్కాతమ్ముళ్లు.
 
సుమలత భర్త ఏదో కేసులో జైలుపాలై శిక్ష అనుభవిస్తున్నాడు. బావను బయటకు తీసుకువచ్చేందుకు ఆస్తి అమ్మి డబ్బు ఇవ్వమని తమ్ముడిని కోరింది. నిరాకరించిన తమ్ముడిపై ద్వేషంతో రగిలిపోయింది. ఎలాగైనా చంపి ఆస్తి సొంతం చేసుకోవాలని పథకం రచించింది. కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి హతమార్చడానికి ప్రయత్నించింది.
 
కిరాయి రౌడీలు ప్లాన్ వేసి రాత్రి పూట సందీప్ రెడ్డిపై దాడి చేసారు. రక్తం చిందేలా దారుణంగా కొట్టి చనిపోయాడనుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన సందీప్ రెడ్డి పోలీసులకు ఫీర్యాదు చేసాడు. వారు విచారణ జరిపి నిజమేనని తేల్చడంతో ఆమెతో సహా నలుగురు కిరాయి ముఠా సభ్యులు మంజు, గౌతమ్, వినాయక్, మౌలాలి ఖాన్‌ను జైలులో వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments