Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ... ముగ్గురి కాల్చివేత

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:51 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఓ పోలీసు ముగ్గురు సహచరులను కాల్చిచంపారు. చనిపోయిన ముగ్గురు సిక్కిం పోలీస్ విభాగానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితుడు ప్రబీణ్ రాయ్ (32) ఢిల్లీ పోలీస్ స్టేషనులో లొంగిపోయాడు. నిందితుడుతో పాటు ముగ్గురు మృతులు ఇండియన్‌ రిజర్వు బెటాలియన్‌లో భాగమైన వీరు ఢిల్లీలోని హైదర్‌పుర్‌ వాటర్‌ ప్లాంట్‌ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్నుట్లు వెల్లడించారు. 
 
ఈ ఘటనపై డీసీపీ ప్రణవ్ తయాల్ స్పందిస్తూ, 'సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేఎన్‌కే మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందింది. కాల్పులకు గురైన పోలీసులలో ఇద్దరు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని బీఎస్‌ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు' అని వివరించారు. 
 
'తన భార్య గురించి తోటి ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిందితుడు ప్రాథమిక విచారణలో చెప్పాడు. తద్వారా తనను మానసిక వేధింపులకు గురిచేశారని వెల్లడించాడు' అని స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ రాయ్‌ తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు ప్రబీణ్‌ సమయ్‌పుర్‌ బద్లీ స్టేషన్‌లో లొంగిపోయినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments