Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ - కర్నాటక రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

Webdunia
శనివారం, 25 జులై 2020 (16:27 IST)
ఐసిస్ లేదా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేరు వింటనే ఒకపుడు ప్రపంచం గజగజ వణికిపోయింది. ముఖ్యంగా, ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సిరియాలో ఏకంగా అంతర్యుద్ధానికి కారణభూతులుగా మారారు. ఆ తర్వాత పలు దేశాల సహకారంతో ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు లేకుండా చేశారు. 
 
అయితే, తాజాగా ఐక్యరాజ్య సమితి ఓ పిడుగులాంటి వార్తను తెలిపింది. ఈ వార్త భారత్‌కు చేదు మాత్రలా ఉంది. ఐసిస్ ఉగ్రవాదులు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉండిపోయారని ఓ రిపోర్టులో హెచ్చరించింది. దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
 
'బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారు. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ప్రస్తుత అధ్యక్షుడు ఒసామా మహమూద్. తమ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ఈ ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసుకుంది' అని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments