Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఒంటరిపోరు.. బీజేపీ సర్కారు తథ్యం : అమిత్ షా

కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (10:41 IST)
కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
మే 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఆయన గత రెండు రోజులుగా మైసూరులో మకాం వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకాలో పొత్తుల్లేకుండానే పోటీచేసి తాము సొంతంగా అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉందన్నారు. ప్రతి దగ్గర బీజేపీ మిగతా అన్ని పార్టీలకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. 
 
లింగాయత్‌లకు మైనారిటీ హోదాపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని… ఇన్నేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ కూడా ముందే ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం లింగాయత్ ఓట్లను చీల్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. 
 
సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన అవినీతిమయమైందన్నారు. దీంతో కర్ణాటక వాసులు విసిగిపోయారని, అభివృద్ధిని వారు కోరుకుంటున్నారన్నారు. నీటిని విడిచి చేప ఎలా ఉండలేదో అవినీతి లేకుండా కాంగ్రెస్ ఉండలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments