Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఒంటరిపోరు.. బీజేపీ సర్కారు తథ్యం : అమిత్ షా

కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (10:41 IST)
కర్ణాటక రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
మే 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఆయన గత రెండు రోజులుగా మైసూరులో మకాం వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకాలో పొత్తుల్లేకుండానే పోటీచేసి తాము సొంతంగా అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉందన్నారు. ప్రతి దగ్గర బీజేపీ మిగతా అన్ని పార్టీలకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. 
 
లింగాయత్‌లకు మైనారిటీ హోదాపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని… ఇన్నేళ్లుగా ప్రభుత్వంలో ఉంటూ కూడా ముందే ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం లింగాయత్ ఓట్లను చీల్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. 
 
సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన అవినీతిమయమైందన్నారు. దీంతో కర్ణాటక వాసులు విసిగిపోయారని, అభివృద్ధిని వారు కోరుకుంటున్నారన్నారు. నీటిని విడిచి చేప ఎలా ఉండలేదో అవినీతి లేకుండా కాంగ్రెస్ ఉండలేదన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments