డీఎంకే నేతకు షాకిచ్చిన బీహార్ సీఎం నితీశ్ - హిందీ తెలిసి ఉండాల్సిందే...

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (14:16 IST)
డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ తేరుకోలేని షాకిచ్చారు. ఢిల్లీలో మంగళవారం ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఇందులో నితీశ్ కుమార్ ప్రసంగించారు. ఈ ప్రసంగం అర్థంకాకపోవడంతో అనువాదం చేయాలని పక్కనే ఉన్న ఆర్జేడీ ఎంపీని టీఆర్ బాలు కోరారు. దీన్ని చూసిన నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ భాష హిందీ అందరికీ తెలిసివుండాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు ఇతర పార్టీల నేతలంతా పాల్గొన్నారు. ఇందులో నితీశ్ హిందీ ప్రసంగం అర్థం కాకపోవడంతో ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ కే ఝా వైపు చూస్తూ నితీశ్ స్పీచ్‌ను అనువాదం చేయగలరా? అని అడిగారు. 
 
దీంతో ఆయన నితీశ్ అనుమతి కోరారు. దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ "మనం మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. హిందీ మన జాతీయ భాష. మనకు ఆ భాష తెలిసివుండాలి అని పేర్కొన్నారు. అంతేకాదు, తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌ను సీఎం నితీశ్ కుమార్ కోరారు. దీంతో టీఆర్ బాలు చిన్నబుచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments