Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ మారథాన్ పోటీల్లో రెండో స్థానం... కొన్ని నిమిషాలకే విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:59 IST)
పాఠశాల స్థాయి రిలే పరుగుపందెం పోటీల్లో ఒక విద్యార్థి పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతను ప్రాతినిథ్యం వహించిన పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే గుండెపోటు వచ్చిన మృత్యువాతపడ్డాడు. మృతుడి వయసు 15 యేళ్లు మాత్రమే. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషాదకర ఘట కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుమకూరు జిల్లాలో పాఠశాల స్థాయిలో పరుగు పందెం పోటీలను నిర్వహించాడు. ఈ పోటీల్లో భీమశంకర్ అనే విద్యార్థి పాల్గొన్నాడు. తన జట్టుతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ విద్యార్థి విచారంలో కూరుకునిపోయాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే భీమశంకర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments