Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం, హత్య... టీ-వడై ఇవ్వరూ... సుప్రీం తీర్పుతో రేపిస్ట్ ఖుషీ....

ఓ కామాంధుడి కామానికి బలైపోయిన అభాగ్యురాలి కథ ఇది. కదులుతున్న రైల్లో ఆమెపై అత్యాచారం చేయడమే కాక, ఆ దారుణానికి పాల్పడి ఆమెను రైల్లో నుంచి తోసేసిన ఘోరమైన గాధ ఇది. వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల క్రితం 24 ఏ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (16:40 IST)
ఓ కామాంధుడి కామానికి బలైపోయిన అభాగ్యురాలి కథ ఇది. కదులుతున్న రైల్లో ఆమెపై అత్యాచారం చేయడమే కాక, ఆ దారుణానికి పాల్పడి ఆమెను రైల్లో నుంచి తోసేసిన ఘోరమైన గాధ ఇది. వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల క్రితం 24 ఏళ్ల సౌమ్య(కేరళ) ఓ షాపింగ్ మాల్‌లో పని ముగించుకుని 2011 ఫిబ్రవరి 1న మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. ఏర్నాకులం నుంచి శొర్‌నూర్ వరకూ రైల్లో వెళుతోంది. ఈ సమయంలో తమిళ యువకుడు గోవిందచామి రైలెక్కాడు. మహిళా బోగీలో సౌమ్య ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. 
 
దొంగతనాలు చేసే అతడు ఆమె వద్ద సొమ్మును దోచుకోవడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను రైల్లో నుంచి కిందికి తోసేశాడు. అడవుల్లో ఆమెను కనుగొన్న స్థానికులు ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆమె మృతి చెందింది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుపై విచారణ చేసిన కోర్టులు గోవిందచామికి మరణ శిక్ష విధించాయి. ఎన్ని కోర్టు మెట్లెక్కినా అదే ఫలితం వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు తలుపుతట్టాడు గోవిందచామి. 
 
వాదనలు విన్న సుప్రీంకోర్టు సౌమ్యపై అత్యాచారం చేసింది గోవిందచామి అయినప్పటికీ ఆ తర్వాత ఆమెను రైల్లోంచి తోసింది అతడా కాదా అని బాధితురాలి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించకపోవడంతో రైల్లోంచి తోసింది గోవిందచామేనని నిరూపితం కాలేదు కనుక అతడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ తీర్పుతో బాధితురాలి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమె ప్రాణాలు తీసిన వ్యక్తికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష విధించి వదిలేస్తారా అని ఆమె ప్రశ్నిస్తోంది. కాగా దోషి గోవిందచామి మాత్రం తనకు టీ, వడై ఇవ్వరూ అంటూ పండగ చేస్కుంటున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments