నెలకు రూ.15 వేలు సంపాదించుకునే దినసరి కూలీకి రూ.14 కోట్ల పన్ను నోటీసు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:10 IST)
అతనో రోజువారీ కూలీ. నెలకు రూ.15 వేలు కష్టపడి సంపాదించుకుంటున్నాడు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టిలో అతనో బడా వ్యాపారి.  అందుకే రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ తాజాగా నోటీసు పంపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన రోహాస్త్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి రోజుకూలీ. నెలకు రూ.12 నుంచి రూ.15 వేలు సంపాదిస్తాడు. అయితే, ఈయనకు తాజాగా ఐటీ శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. దాన్ని చూసిన ఆయన విస్తుపోయాడు. నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. 
 
తనకు అందిన నోటీసులను చూసిన షాక్‌కు గురై కంగారుపడిపోయిన ఆయన.. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, తాను ఒక దినసరి కూలీనని చెప్పారు. బీహార్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లినపుడు అక్కడి వ్యాపారులు తమ పాన్, ఆధార్ కార్డులు తీసుకుంటారని, ఈ క్రమంలో ఆ వివరాలు ఎక్కడైనా దుర్వినియోగమై ఉండటంతో ఇలాంటి నోటీసులు వచ్చి పంపించివుంటారని వాపోతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments