Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ.15 వేలు సంపాదించుకునే దినసరి కూలీకి రూ.14 కోట్ల పన్ను నోటీసు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:10 IST)
అతనో రోజువారీ కూలీ. నెలకు రూ.15 వేలు కష్టపడి సంపాదించుకుంటున్నాడు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టిలో అతనో బడా వ్యాపారి.  అందుకే రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ తాజాగా నోటీసు పంపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన రోహాస్త్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి రోజుకూలీ. నెలకు రూ.12 నుంచి రూ.15 వేలు సంపాదిస్తాడు. అయితే, ఈయనకు తాజాగా ఐటీ శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. దాన్ని చూసిన ఆయన విస్తుపోయాడు. నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. 
 
తనకు అందిన నోటీసులను చూసిన షాక్‌కు గురై కంగారుపడిపోయిన ఆయన.. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, తాను ఒక దినసరి కూలీనని చెప్పారు. బీహార్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లినపుడు అక్కడి వ్యాపారులు తమ పాన్, ఆధార్ కార్డులు తీసుకుంటారని, ఈ క్రమంలో ఆ వివరాలు ఎక్కడైనా దుర్వినియోగమై ఉండటంతో ఇలాంటి నోటీసులు వచ్చి పంపించివుంటారని వాపోతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments