Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా 'పీఠముడి' : ఆర్ఎస్ఎస్‌ను ఆశ్రయించిన శివసేన

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (16:28 IST)
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న గడువు సమీపిస్తోంది. దీంతో శివసేన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఆశ్రయించింది. నిర్ణీత గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన మోహన్ భగవత్‌కు ఓ లేఖ రాసింది. ఈ లేఖను శివసేన నేత కిశోర్ తివారీ రాశారు. 
 
ఇందులో 'కూటమి ధర్మానికి' బీజేపీ తూట్లు పొడుస్తున్నదనీ... మోహన్ భగవత్ జోక్యం చేసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కిశోర్ తివారీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. శివసేనకు మద్దతు ఇవ్వరాదంటూ కాంగ్రెస్, ఎన్సీపీలు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తివారీ లేఖ వెలుగులోకి రావడం గమనార్హం. 
 
బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా మహారాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారనీ.. కానీ రాష్ట్రంలో కూటమి ధర్మాన్ని అనుసరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమైందని తివారీ ఆరోపించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాల చూపంతా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వైపు మళ్ళాయి. ఇరు పార్టీలు మెట్టు దిగని నేపథ్యంలో భగవత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments