Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ ప్లానింగ్ అవసరమని ముస్లింలకు చెప్పండి: మోడీకి సూచన

Webdunia
సోమవారం, 6 జులై 2015 (18:37 IST)
ముస్లింలకు ధీటుగా హిందూ జనాభాను పెంచుకుంటూ పోవడం కాదు.. కుటుంబ నియంత్రణ పాటించాలని ముస్లింలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే సూటిగా చెప్పాలని శివసేన సూచించింది. ఈ విషయంలో సంఘ్ చొరవ తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ అన్ని మతాలకు కచ్చితంగా వర్తింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని శివసేన డిమాండ్ చేసింది. 
 
ముస్లిం జనాభా నానాటికీ పెరుగుతున్న కారణంగా దేశంలో భాషా సంబంధ, భౌగోళిక పరమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించింది. తద్వారా దేశ సమైక్యతకు బీటలువారే ప్రమాదం ఉందని శివసేన స్పష్టం చేసింది. అందుచేత కుటుంబ నియంత్రణ ముస్లింలకు తెలియజేయాల్సిన బాధ్యతను ప్రధాని తీసుకోవాలని, "దేశ చట్టాన్ని గౌరవించాలని, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన ముస్లింలకు వివరించాలి. 
 
ముస్లింలు అర్ధరాత్రి వచ్చి తన ఇంటి తలుపు తట్టినా వారి సమస్యలు పరిష్కరిస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. అదే రీతిలో ముస్లింలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా?" అని శివసేన తన సామ్నా పత్రికలో పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments