Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హింసను ప్రేరేపించింది బీజేపీనే : శివసేన

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (18:19 IST)
శాంతియుతంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ సర్కారేనని శివసేన ఆరోపించింది. ఢిల్లీలో హింస జరగడానికి బీజేపీనే ప్రధాన కారణమని పేర్కొంది. 
 
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని పేర్కొంది. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చెలరేగిన హింస సమర్ధనీయం కాదని, దీనికి కేవలం రైతులనే నిందించడం తగదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. 
 
నిజానికి గత రెండు నెలలుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన శాంతియుతంగా సాగుతోందని, రైతులు ఎన్నడూ సంయమనం కోల్పోలేదని గుర్తు చేసింది.
 
కానీ, వారు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ భగ్నం చేసేందుకు రైతులను రెచ్చగొట్టి హింసకు మళ్లిస్తే వారి ఆందోళనను నీరుగార్చవచ్చని కేంద్ర ప్రభుత్వం కోరుకుందని పేర్కొంది. చేతిలో కర్రలతో కనిపించిన రైతులను జాతి విద్రోహులుగా పిలుస్తున్నారని.. కాల్పులు జరపండి.. హతమార్చండి అని పిలుపుఇచ్చిన వారంతా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఇంకా మంత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించింది. 
 
ఖలిస్తానీలనే ముద్రవేసినా రైతులు శాంతంగానే ఉన్నారని శివసేన పత్రిక పేర్కొంది. ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక నిరసనలకు నేతృత్వం వహంచిన దీప్‌ సిధు పంజాబ్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు సన్నిహితుడని ఆరోపించింది. ఈయనకు బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments