Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ప్రజలంతా ఒక్కటే... షియా, సున్నీ వక్ఫ్ బోర్డులు రద్దు : సీఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని పేర్కొంటూ... యూపీలో ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (10:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని పేర్కొంటూ... యూపీలో ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
 
షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ, సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ మంత్రిగా వ్యవహరించిన అజామ్ ఖాన్‌ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు పాల్పడిన అవకతవకలపై వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. 
 
ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సున్నీ, షియా వక్ఫ్ బోర్డు రద్దు చేయాలంటూ వక్ఫ్ మంత్రి మొషిన్ రాజాను ఆదేశించారు. చట్టపరమైన అన్ని విషయాలు పరిశీలించిన అనంతరం సున్నీ, షియాల వక్ఫ్ బోర్డును రద్దు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు రద్దు, ఇతర విషయాలపై న్యాయ, చట్టపరమైన అంశాలపై అధ్యయనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం