Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనా బోరాను గొంతు నులిమి చంపేశారు : ఇద్రాణీ మాజీ డ్రైవర్

Webdunia
బుధవారం, 11 మే 2016 (15:10 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా కేసులో తాజాగా మరో నిజం వెలుగు చూసింది. షీనా బోరాను ఆమె తల్లే హత్య చేసినట్టు ఇప్పటికే తేల్చింది. ఈ నేపథ్యంలో షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా మాజీ కారు డ్రైవర్, ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన శ్యామ్ రాయ్ అప్రూవర్‌గా మారిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కోర్టుకు లేఖ రాశాడు. 
 
షీనా బోరాను కారులోనే గొంతు నులిమి చంపారని శ్యామ్‌ లేఖలో పేర్కొన్నాడు. ఈ కేసులో తనకు భాగముందని.. జరిగిన నిజాలన్నీ కోర్టుకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. అదేసమయంలో ఈ కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోర్టును ప్రాధేయపడ్డాడు. 
 
2012లో షీనాబొరా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆర్థిక కారణాల వల్లే తల్లి ఇంద్రాణీ.. మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాతో కలిసి షీనాను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో వారిద్దరినీ దోషులుగా గుర్తిస్తూ.. గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. అనంతరం ఇంద్రాణి భర్త పీటర్‌కు కూడా ఈ కేసుతో సంబంధముందని ఆరోపిస్తూ.. గత నవంబర్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలు జీవితం గడుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments