Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు శరద్ పవార్ దూరం

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (10:35 IST)
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ హాజరుకావడం లేదు. తనకు అందిన ఆహ్వానంపై రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌కు బదులిస్తూ.. లేఖ రాశారు. తర్వాత దర్శనానికి వస్తానని పేర్కొన్నారు.
 
'జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్శనానికి వస్తాను. అప్పుడు దర్శనం సులభంగా ఉంటుంది. అంతేగాకుండా అప్పటికి రామ మందిరం నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి' అని ట్రస్టుకు పవార్‌ వెల్లడించారు. 
 
ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఇదేవిధంగా స్పందించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత అధీర్‌ రంజన్ చౌధరికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న వారు.. దానిని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్‌ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 
2024 జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments