Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగబిడ్డను కనలేదనీ... సలసల కాగే నీళ్ళు భార్యపై పోసిన భర్త

Shahjahanpur
Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (19:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో మరో దారుణం జరిగింది. ముగ్గురూ ఆడబిడ్డలే పుట్టారన్న అక్కసుతో పాటు మగబిడ్డను కనలేదన్న అక్కసుతో భార్యపై సలసలకాగే వేడి నీళ్లను కసాయి భర్త గుమ్మరించాడు. దీంతో ఆ మహిళ శరీరంతా నీరు బొబ్బలు వచ్చాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌ అనే వ్యక్తికి 2013లో సంజు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి రూ.50 వేలు అదనపు కట్నం తేవాలంటూ భార్యను భర్త వేధించసాగాడు. 
 
ఇటీవల ఆమెకు భోజనం కూడా పెట్టడం మానేశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 13 ఇంట్లో ఉన్న భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో వేడినీళ్లు పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments