Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చావుకి నేనే కారణం: మహిళా ఎస్సై ఆత్మహత్య

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (15:16 IST)
తన చావుకి తనే కారణమంటూ ఓ మహిళా ఎస్సై తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ జిల్లాలోని అనూప్షహర్ పోలీసు స్టేషనులో 30 ఏళ్ల అర్జూ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంది. ఐతే ఏమయ్యిందో ఏమోగానీ శుక్రవారం నాడు ఆమె తను అద్దెకు వుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.
 
ఇంట్లో నుంచి అర్జూ ఎంతకీ రాకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యానుకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. కాగా తన చావుకి తనే కారణమని సూసైడ్ నోట్ రాసింది అర్జూ. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments