Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓమిక్రాన్ ముప్పు- జనవరి 5 వరకు 144సెక్షన్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (11:30 IST)
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చింది. జనవరి 5, 2022 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న క్రమంలో యోగి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
జనం గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. సైబర్ క్రైమ్ సెల్ కూడా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిశితంగా గమనిస్తుంది. ఆన్‌లైన్‌లో పుకార్లు వ్యాప్తి చేయడం, అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
 
క్రిస్మస్, డిసెంబర్ 31, న్యూ ఇయర్ పార్టీల సమయంలో, కరోనా వైరస్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది సర్కారు. పోలీసులు మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. 
 
రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, ఏదైనా కార్యక్రమాలలో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments