Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:51 IST)
విద్య నేర్పించాల్సిన గురువే మృగంలా మారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వ్యక్తి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి పదేళ్ల కారాశిక్ష విధించింది. గుజరాత్‌లోని దియోదర్ ప్రాంతంలో చన్ బు భగోరా అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
 
2017వ సంవత్సరంలో పాఠశాల ముగిసిన తర్వాత అందులో చదివే ఒక బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
 
దీనిపై విచారణ జరిపిన పోలీసులు సెక్షన్ 376 క్రింద, పోస్కో చట్టం క్రింద కేసులు పెట్టి ఆ వ్యక్తిని రిమాండుకు పంపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఆ వ్యక్తికి 11 వేల రూపాయల జరిమానాతో పాటుగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా సమాజం తలదించుకునే పని చేసావంటూ నిందితుడిపై మండిపడ్డాడు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments