Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయండి : సుప్రీంలో పిటిషన్

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (15:49 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను శివసేన పార్టీ విఫ్ సునీల్ ప్రభు దాఖలు చేయగా, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 
 
సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. దీంతో జూలై 11వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 
 
కాగా, శివసేన పార్టీకి చెందిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఇపుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సొంత అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏకంగా 45 మందికిపై ఎమ్మెల్యేలను తన చెంతకు చేరుకున్నారు. వారిని ఒక శిబిరంగా చేసుకుని బీజేపీ మద్దతుతో ఆయన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments