విజయ్ మాల్యాకు చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు... ఒక్క పైసా కూడా చెల్లించలేదా?

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (13:46 IST)
బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. దేశంలోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని తప్పుబట్టింది. 
 
మాల్యాకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. వీటిని బ్యాంకులకు అప్పగించడం ద్వారా మాల్యా చెల్లించాల్సిన సొమ్మును ఈడీ రాబట్టుకోవచ్చంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారణ సందర్భంగా.. మాల్యా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మాల్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments