Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్ల డబ్బుకు కాపలా ఉండాల్సిన మేనేజర్ బ్యాంకుకే కన్నం వేశాడు...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (10:32 IST)
కస్టమర్ల డబ్బుకు కాపలా ఉండాల్సిన మేనేజర్ ఒకరు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. నెలకు 50 వేల రూపాయల విలువ చేసే బంగారు నాణేలను దొంగిలిస్తూ వచ్చాడు. ఇలా 17 నెలల పాటు దొంగతనం చేశాడు. చివరకు బ్యాంకు ఆడిటింగ్‌లో అతని బండారం బయటపడింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం అంగీకరించడంతో అరెస్టు చేసి కటకటాలవెనక్కి పంపించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ బ్యాంకు చోరీ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు 82 కిలోమీటర్ల దూరంలోని మెమారి అనే ప్రాంతలో ఎస్.బి.ఐ శాఖ ఉంది. ఈ శాఖ మేనేజరుగా తారక్ జైశ్వాల్ పని చేస్తున్నారు. ఈయన ఈ శాఖలో 17 నెలలుగా పని చేస్తూ, 17 నెలల నుంచి ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అది రోజుకు కొన్ని నాణేలను దొంగతనం చేయడం. అంటే నెలకు రూ.50 వేల విలువైన కాయిన్స్‌ను చోరీ చేస్తూ వచ్చాడు. 
 
ఈ విషయం బ్యాంకు ఆడిటింగ్‌లో బట్టబయలైంది. నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఆడిట్ మొదలవగా తారక్ బండారం బయటపడింది. శుక్రవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా.. తాను దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
 
లాటరీలకు అలవాటు పడిన తారక్... వాటిని కొనుగోలు చేయడానికి ఈ నాణేలను దొంగతనం చేయడం మొదలుపెట్టినట్టు వెల్లడించాడు. అలా రూ.84 లక్షల విలువ చేసే నాణేలను దొంగిలించినట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments