Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ విడుదలపై 2 రోజుల్లో క్లారిటీ.. మంచి కబురు కోసం..?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (10:45 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష , రూ.10 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. శశికళ జైలుకు వెళ్లి 3 సంవత్సరాల 8 నెలలు పూర్తయింది. ఇంకా మూడు నెలలు (జనవరి వరకు) ఆమె జైలులో ఉండాల్సి ఉంది.
 
కానీ, సత్ప్రవర్తన కారణంగా ఆమె ముందుగానే విడుదలయ్యే అవకాశముందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ విషయమై ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండియన్‌ మాట్లాడుతూ.. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేది వరకు న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారన్నారు. సెలవుల తరువాత న్యాయస్థానం నుంచి కబురు వస్తుందని ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఒకవేళ జరిమానా చెల్లించాలంటూ శశికళకు కబురు అందితే, తనకు లేఖ ద్వారా ఆ విషయం తెలియజేస్తారని, వెంటనే జరిమానాను న్యాయస్థానంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments