Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ... జయలలిత స్థానాన్ని ఆక్రమించిన చిన్నమ్మ

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (10:17 IST)
తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. 
 
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ప్రతి పాదిస్తూ ఓ తీర్మానం చేశారు. దీనికి సర్వసభ్య సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇకపై ఆమె తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ నేతలు తప్పనిసరిగా కట్టుబడాల్సి ఉంటుంది. అలాగే, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యేలు పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరనున్నారు. అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టడంతో... ఆ పార్టీలో కొత్త శకం ప్రారంభమయినట్టైంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments