Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు తర్వాత చిన్నమ్మే సీఎం.. జయకు తర్వాత శశికళ.. జోరుగా ప్రచారం..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అలంకరించారు. అయితే అమ్మకు తర్వాత అన్నాడీఎంకే వారసులు ఎవరనేదానిపై ప

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (14:47 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం పదవిని అలంకరించారు. అయితే అమ్మకు తర్వాత అన్నాడీఎంకే వారసులు ఎవరనేదానిపై ప్రస్తుతం తమిళనాడులో చర్చ సాగుతోంది. సీఎం జయలలితకు తర్వాత ఆమె స్థానంలో రాజకీయాల్లో రాణించేందుకు పలుకుబడి గల వ్యక్తులు లేరనే లోటున్నప్పటికీ.. తాజాగా అమ్మకు తర్వాత శశికళ (చిన్నమ్మ) అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 
 
అమ్మకు తర్వాత ఆమె వీరవిధేయుడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు జయలలిత భావిస్తున్నప్పటికీ.. శశికళను ఆ పార్టీకి వారసులు చేయాలనే ఒత్తిడి, ప్రచారం ఎక్కువవుతోంది. దీనికోసం చిన్నమ్మ పేరుతో కొత్త పార్టీని స్థాపించడం జరిగిపోయింది. 
 
శివగంగైకి ఎ.ఎల్. చిన్నతంబి అనే వ్యక్తి శశికళను సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమంటున్నారు. అమ్మకు తర్వాత చిన్నమ్మ శశికళను 2021వ సంవత్సరం సీఎంగా చేస్తామంటున్నారు. మరి శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు ఇవ్వడంపై జయమ్మ సానుకూలంగా స్పందిస్తారో లేకుంటే సీరియస్ అవుతారో తెలియాలంటే వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments