Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు హత్య : ఆరుగురికి మరణశిక్ష

తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్ల

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:33 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్లో ఆరుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది మార్చి 13వ తేదీన ఉడుమల్‌పేట్ బస్‌స్టాండ్‌కు సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసి వస్తున్న శంకర్ దంపతులపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య కౌశల్య కొన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స కోలుకుంది. 
 
ఈ హత్య కేసుకు సంబంధించి వీడియో ఫూటేజీ ఆధారంగా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తిరుపూరు జిల్లా సెషన్సు కోర్టులో జరిగింది. మొత్తం 1500 పేజీల చార్జిషీటును పరిశీలించిన న్యాయమూర్తి అలమేలు నటరాజన్ మంగళవారం తుది తీర్పును వెలువరించారు. 
 
మొత్తం 11 మందిలో ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవిత ఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు శంకర్ భార్య కౌసల్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments