Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (11:27 IST)
ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చేసిన ఈ యాప్‌ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో వివరించారు.

సందేశ్‌కు సంబంధించిన విశేషాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. ‘సందేశ్ ఓపెన్ బేస్డ్ యాప్. ఇది చాలా సురక్షితమైనది. క్లౌడ్ ఎనేబుల్ అయిన ఈ యాప్‌కు సంబంధించిన కంట్రోల్‌‌‌ను ప్రభుత్వమే చూసుకుంటుంది.

వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్‌ లాంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాప్ స్టోర్‌లో కూడా దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం’ అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 
 
వాట్సాప్‌లా పని చేసే సందేశ్‌ను నేషనల్ ఇన్ఫోర్‌‌మెటిక్స్ సెంటర్‌ (ఎన్‌ఐసీ) డెవలప్ చేసింది. ఎన్‌ఐసీతోపాటు ప్రభుత్వ ఐటీ వింగ్ కలసి ఈ యాప్‌ను లాంచ్ చేశాయి.

మొబైల్ నెంబర్‌తోపాటు ఈమెయిల్ ఐడీతోనూ కమ్యూనికేట్ చేసుకునేలా సందేశ్‌ను డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు వాడుతున్న ఈ యాప్‌ ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.

ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాక.. ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే చాలు యాప్‌ను వినియోగించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments