Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు కొరతపై వదంతులు... రూ.800 నుంచి రూ.1000 వరకు పలికిన బస్తా ధర..

రూ.400 ఉన్న బస్తా ఉప్పును రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారని.. అటు వినియోగదారులు కూడా ఆలస్యం చేస్తే ఉప్పు దొరకదేమో అన్న భయంతో అధిక ధరకే ఉప్పు సంచులు కొనుక్కుపోతున్నారు. ఉప్పు కొరతపై వదంతులు ఉత్త

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (13:51 IST)
రూ.400 ఉన్న బస్తా ఉప్పును రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారని.. అటు వినియోగదారులు కూడా ఆలస్యం చేస్తే ఉప్పు దొరకదేమో అన్న భయంతో అధిక ధరకే ఉప్పు సంచులు కొనుక్కుపోతున్నారు. ఉప్పు కొరతపై వదంతులు ఉత్తరాది నుంచి హైదరాబాద్ చేరాయి. ఉప్పు కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 
 
హైదరాబాద్‌లో అర్థరాత్రి కిలో ఉప్పు ప్యాకెట్‌ను రూ.300 నుంచి 500లకు అమ్మారు. పాతబస్తీతో పాటు బోరబండ, యూసుఫ్‌గూడ‌లోని పలు కిరాణా షాపులకు జనం బారులు తీరారు. సంగారెడ్డి జిల్లాలో పలువురు వినియోగదారులు ఓ కిరాణ దుకాణం నుంచి డబ్బు చెల్లించకుండానే ఉప్పును లాక్కొని పారిపోయారు. వినియోగదారులు వాగ్వివాదానికి దిగితే అప్పుడు అసలు ధరకు అమ్ముతున్నారు. 
 
అయితే ఉప్పు కొరత ఏర్పడిందన్న వదంతులు నమ్మొద్దని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని వెల్లడించారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప్పును బ్లాక్‌లో అమ్మాలని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments