అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... రాత్రి 11 గంటల వరకు..?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (10:18 IST)
ఇటీవల ప్రారంభమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రెండో దశలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా, ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనం ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించారు.
 
అయ్యప్ప దర్శనాలను గంట ముందుగానే ప్రారంభించడం ద్వారా ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనం పొందుతారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతోపాటు భక్తుల రద్దీ కూడా కొంతమేర తగ్గుతుంది. 
 
అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూస్తున్న ఐజీ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. వర్చువల్ క్యూ ద్వారా 90 వేలు, అక్కడికక్కడే 30 వేల బుకింగ్‌లు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలకు కొంత అంతరాయం కలుగుతోందని తెలిపారు.
 
అయితే అయ్యప్ప దర్శన వేళలను రోజూ 17గంటలకు మించి పొడిగించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు మంచి నీళ్లు, బిస్కెట్లు అందిస్తున్నామని బోర్డులో పేర్కొన్నారు.
 
ఇక శబరిమల కొండపై జరిగిన తొక్కిసలాటలో 11ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపుతోంది. అయ్యప్ప దర్శనానికి భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో లైన్‌లో దర్శనం కోసం వేచి ఉన్న బాలిక స్పృహ కోల్పోయింది. 
 
వెంటనే పంపా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తమిళనాడులోని సేలంకు చెందిన బాలిక మూడేళ్ల నుంచి గుండె జబ్బుతో బాధపడుతోందని ఆమె బంధువులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments