Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోని పెద్ద తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ : మహారాష్ట్ర రిటైర్డ్ ఐపీఎస్

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (12:13 IST)
మహారాష్ట్ర పోలీసు శాఖలో ఐజీ స్థాయి ఉన్నతాధికారిగా పనిచేసిన మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విధ్వంసక చర్యలకు పాల్పడిన ఆరెస్సెస్ ముమ్మాటికీ ఉగ్రవాద సంస్థేనని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముష్రిఫ్ కుండబద్దలు కొట్టారు. 
 
కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశంలోనే నెంబర్‌వన్ ఉగ్రవాద సంస్థ ముమ్మాటికీ ఆర్ఎస్ఎస్సేనని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని మక్కా మసీదు పేలుళ్లతో పాటు మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌పై బాంబు దాడి వంటి 13 పెను విధ్వంసాలకు ఆ సంస్థ పాల్పడిందని చెప్పారు. ఆర్‌డీఎక్స్‌ను వినియోగించిన సంస్థగానూ ఆరెస్సెస్‌పై కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments